శంషాబాద్, వెలుగు : శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి సింగపూర్ ఎయిర్లైన్స్ అదనపు విమానాలను ప్రారంభించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆసియా దేశాలకు ముఖ్య రవాణా కేంద్రం సింగపూర్. ఇక్కడి నుంచి విమాన సర్వీసుల కనెక్టివిటీ ద్వారా విమాన ప్రయాణానికి సులువు అవుతుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈనెల 29 నుంచి సింగపూర్ ఎయిర్లైన్స్ కు చెందిన ఎస్ క్యూ 519 విమానం, హైదరాబాద్ నుంచి 11.20 గంటలకు బయలుదేరి 18.20 గంటలకు (సింగపూర్ స్టాండర్డ్ టైమ్) సింగపూర్ చేరుకుంటుంది.
సింగపూర్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఎస్ క్యూ 518 సింగపూర్ నుంచి 08..00 గంటలకు (సింగపూర్ స్టాండర్డ్ టైమ్) బయలుదేరి 10.15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ సందర్భంగా విమానయాన సంస్థల 20 వ వార్షికోత్సవం సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో సింగపూర్ ఎయిర్లైన్స్ అధికారులు, జీఎంఆర్ విమానాశ్రయ అధికారులు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.