
బోధన్, వెలుగు: బోధన్ పట్టణానికి చెందిన వైష్ణవి తన తండ్రి పరమేశ్వర్ పట్టించుకోవడంలేదని కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ప్రతినిధులకు రెండేండ్ల కింద ఫిర్యాదు చేయగా, ఆమెను నిజామాబాద్లోని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. బుధవారం పరమేశ్వర్ ను అదనపు న్యాయమూర్తి టి.శ్రీనివాస్ ముందు హాజరుపర్చగా ఆస్తిలోని 20 గుంటల భూమిని, సగం జీతం ఇప్పించినట్లు కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ప్రతినిధులు పద్మాసింగ్, సుమలత తెలిపారు.