
ఆందోళన చేస్తున్న తమ పార్టీ మహిళా ఎంపీలపై మార్షల్స్ దాడికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. పార్లమెంటులో ఇలాంటి ఘటన ఇంతకుముందెప్పుడూ జరగలేదన్నారు. గౌరవనీయులైన సభ్యులపై దాడికి పాల్పడ్డ సెక్యూరిటీ సిబ్బందిపై స్పీకర్, ప్రభుత్వం ఏంచర్యలు తీసుకుంటుందో వేచి చూస్తామన్నారు. ఆ తర్వాత ఏంచేయాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు. అధికార బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. కాంగ్రెస్ ఎంపీలు తమ ప్రవర్తనతో లోక్ సభకు తలవంపులు తెచ్చారని, కాంగ్రెస్ జూనియర్ ఎంపీలు అభ్యంతరకర రీతిలో ఆందోళన చేస్తుంటే సీనియర్ ఎంపీలు చోద్యం చూస్తున్నారని లా మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్మండిపడ్డారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు కూడా కాంగ్రెస్ ఆరోపణల్ని తప్పుపట్టారు.