ఆదిత్య- ఎల్ 1..డేటా సేకరణ స్టార్ట్

ఆదిత్య- ఎల్ 1..డేటా సేకరణ స్టార్ట్

ఆదిత్య- ఎల్1  శాస్త్రీయ డేటాను సేకరించడం మొదలుపెట్టింది.  మిషన్‌లోని స్టెప్స్ పరికరానికి అమర్చిన సెన్సార్లు భూమికి 50 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే సప్రా-థర్మల్, ఎనర్జిటిక్ ఐయాన్స్, ఎలక్ట్రాన్స్‌ను కొలవడాన్ని ఆరంభించాయి.  ఈ డేటా భూమి చుట్టూ ఉన్న కణాల ప్రవర్తనను విశ్లేషించడంలో సహాయపడుతుందని.. భూమి నుండి 50 వేల కిలో మీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లే వరకు ఈ మిషన్ డేటాను సేకరిస్తుందని ఇస్రో ప్రకటించింది. యూనిట్లలోని ఒక దాని ద్వారా సేకరించిన డేటా శక్తివంతమైన కణాల పర్యావరణంలో వైవిధ్యాలను ప్రదర్శిస్తుందని ఇస్రో పేర్కొంది.

ALSO READ: తిప్పి కొట్టిన బైక్ స్టంట్.. పొలాల్లో ఎగిరిపడ్డ యూట్యూబర్

ఆదిత్య ఎల్ 1 భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ దిశగా దూసుకెళ్తోంది. ఇందుకు 4 నెలల సమయం పడుతుంది.  ఆదిత్య ఎల్1 శాటిలైట్‌లో మొత్తం 7 పేలోడ్స్ ను అమర్చారు. ఇవి సూర్యుడి పొరలైన ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌‌తో పాటు వెలుపల ఉండే కరోనాని అధ్యయనం చేయనున్నాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులతో పాటు అక్కడి వాతావరణం గురించి ఇవి తెలుసుకోనున్నాయి.