ఫాంహౌస్ కేసు: రెండో రోజు సిట్ విచారణకు శ్రీనివాస్

ఫాంహౌస్ కేసు: రెండో రోజు సిట్ విచారణకు శ్రీనివాస్

హైదరాబాద్ : ఫాం హౌస్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న అడ్వొకేట్ శ్రీనివాస్ రెండోరోజు విచారణకు హాజరయ్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో శ్రీనివాస్ విచారణ కొనసాగుతోంది. నిన్న విచారణలో భాగంగా సిట్ అధికారులు అడిగిన వివరాలతో ఆయన హాజరయ్యారు. మొబైల్ ఫోన్, బ్యాంక్ స్టేట్మెంట్ ను సిట్ కు సమర్పించారు. వాటి ఆధారంగా అధికారులు శ్రీనివాస్ ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం సైతం సిట్ ఆయనను 8 గంటల పాటు ప్రశ్నించింది.

ఫాంహౌస్ కేసుకు సంబంధించి సిట్ అడ్వొకేట్ శ్రీనివాస్, బీఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామిలను సోమవారం విచారణకు పిలిచింది. అయితే శ్రీనివాస్ మినహా మిగిలిన ముగ్గురు విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో అధికారులు పరారీలో ఉన్న జగ్గు స్వామిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.