
న్యూఢిల్లీ: ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు ముహూర్తం ఖరారైంది. యాక్సియం 4 మిషన్లో భాగంగా శుభాంశు సహా నలుగురు ఆస్ట్రోనాట్లు స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్లో ఈ నెల 19న రోదసిలోకి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ఇస్రో శనివారం తెలిపింది. ‘‘ఇప్పటికే యాక్సియం 4 మిషన్ నాలుగుసార్లు వాయిదా పడింది.
టెక్నికల్ కారణాల వల్ల మిషన్ మే 29, ఈ నెల 8, 10, 11 తేదీలకు పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత యాక్సియం స్పేస్, స్పేస్ ఎక్స్తో కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. రాకెట్లో ఏర్పడిన ఆక్సిజన్ లీక్ సమస్యను పరిష్కరించామని, ఈ నెల 19న మిషన్ చేపట్టేందుకు సిద్ధమని యాక్సియం స్పేస్ తెలిపింది” అని ఇస్రో పేర్కొంది.