19న శుక్లా స్పేస్ టూర్... స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ లో జర్నీ

19న శుక్లా స్పేస్ టూర్... స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ లో జర్నీ

న్యూఢిల్లీ: ఇండియన్  ఆస్ట్రోనాట్  శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు ముహూర్తం ఖరారైంది. యాక్సియం 4 మిషన్​లో భాగంగా శుభాంశు సహా నలుగురు ఆస్ట్రోనాట్లు స్పేస్ ఎక్స్​కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్​లో ఈ నెల 19న రోదసిలోకి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ఇస్రో శనివారం తెలిపింది. ‘‘ఇప్పటికే యాక్సియం 4 మిషన్ నాలుగుసార్లు వాయిదా పడింది. 

టెక్నికల్  కారణాల వల్ల మిషన్  మే 29, ఈ నెల 8, 10, 11 తేదీలకు పోస్ట్ పోన్  అయింది. ఆ తర్వాత  యాక్సియం  స్పేస్, స్పేస్ ఎక్స్​తో కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. రాకెట్​లో ఏర్పడిన ఆక్సిజన్ లీక్ సమస్యను పరిష్కరించామని, ఈ నెల 19న మిషన్​ చేపట్టేందుకు సిద్ధమని యాక్సియం స్పేస్  తెలిపింది” అని ఇస్రో పేర్కొంది.