
ప్రతి భారతీయ పౌరుడికి ప్రత్యేకమైన అధికారిక గుర్తింపుగా తీసుకొచ్చిన ఆధార్ లాగానే, ప్రతి చిరునామాకు ప్రత్యేకమైన డిజిటల్ ఐడి ఉండేలా కొత్త వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇళ్ళు ,స్థలాలను ఖచ్చితంగా,త్వరగా గుర్తించడం కోసం ఈ ప్రత్యేకమైన డిజిటల్ ID ని తీసుకొస్తుంది. ఇది సర్వీస్ డెలివరీ, డిజిటల్ పాలన ప్రయోజనాలను దేశంలోని ప్రతి మూలకు అందించే లక్ష్యంగా పనిచేయనుంది.
దేశవ్యాప్తంగా ఇండ్లు, ప్రదేశాలకు డిజిటల్ IDలను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. UPI, ఆధార్ సక్సెస్ తర్వాత ఈ కొత్త ఆలోచన చేస్తోంది.డేటాభద్రత, సర్వీస్ డెలివరీ, గవర్నెన్స్ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ IDలను రూపొందిస్తున్నట్లు తెలిపింది.
ఈ డిజిటల్ ఐడీ ద్వారా ప్రతి ఇంటికి, వ్యాపార సముదాయాలు, ప్రజా మౌలిక సదుపాయాల సైట్లకు ప్రత్యేకమైన డిజిటల్ గుర్తింపు నెంబరును అందించనుంది. ఆధార్ ద్వారా వ్యక్తులకు గుర్తింపు అందించినట్లే ఈ కొత్త ఐడీలు ప్రదేశాలకు, ఇండ్లకు డిజిటల్ చిరునామాగా పనిచేస్తాయి. ప్రభుత్వ సంస్థలు, వ్యాపారాలు, ప్రజా అనుసంధానం, లావాదేవీలు వంటివి ఈ డిజిటల్ ఐడీ ల ద్వారా మరింత సులభతరం కానున్నాయి.
Also Read : ట్రంప్ సుంకాలకు అమెరికా కోర్ట్ బ్రేక్
దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్న క్రమంలో అడ్రస్ లను వెదికి పట్టుకోవడం చాలా కష్టంగా మారింది. సర్వీస్ డెలివరీ, ఆస్తుల నిర్వహణ, విపత్తుల సమయంలో ఎదురయ్యే సవాళ్లు వీటన్నింటిని సులభంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ డిజిటల్ ఐడీలు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఈ డిజిటల్ కార్డులను మున్సిపల్, రాష్ట్ర ,కేంద్ర డేటాబేస్లతో అనుసంధానం చేయడం వలన పట్టణప్రణాళిక, పన్నుల చెల్లింపులు, ఇతర పరిపాలనాపరమైన ప్రక్రియలు మరింత సులభతరం కానున్నాయి.
ఈ డిజిటల్ ID వ్యవస్థను రాష్ట్రం, స్థానిక అధికారుల సహకారంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ నిర్వహించనుంది. ఆస్తి యజమానులు,నివాసితులు తన ఇండ్లు, వ్యాపారలకు సంబంధించిన ఆస్తులను ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తింపు IDగా డిజిటల్ సర్టిఫికేట్ లేదా QR కోడ్ను పొందవచ్చు.
దేశంలో డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు అనగా UPI,ఆధార్ సక్సెస్ సాధించాయి. UPI డిజిటల్ చెల్లింపులలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగా, ఆధార్ సురక్షితమైన, గుర్తింపు ధృవీకరణకు ఆధారంగా నిలిచింది. ఇప్పుడు ఇళ్ళు ,ప్రదేశాల కోసం డిజిటల్ IDలను అందుబాటులోకి తీసుకురానుంది. డిజిటల్ పాలన ప్రయోజనాలను దేశంలోని ప్రతి మూలకు అందించే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ ఐడీలను తీసుకొస్తుంది.
2025 చివరి నాటికి ఈ డిజిటల్ ఐడీలను నగరాల్లో పైలట్ ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశం ఉంది. రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా వీటిని అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం టెక్నాలజీ సంస్థలు, టౌన్ ప్లానర్లు, పౌర సమాజ సంస్థలతో సహా వాటాదారుల నుంచి అభిప్రాయాన్ని కూడా కోరుతోంది.