బడి బువ్వ లేక విద్యార్థుల తిప్పలు..రాజాపూర్ హైస్కూల్ లో ప్రారంభం కాని మధ్యాహ్న భోజనం

బడి బువ్వ లేక విద్యార్థుల తిప్పలు..రాజాపూర్ హైస్కూల్ లో ప్రారంభం కాని మధ్యాహ్న భోజనం
  • కోడేరు మండలం 

కోడేరు, వెలుగు: నాగర్ కర్నూల్  జిల్లా కోడేరు మండలం రాజాపూర్  హైస్కూల్ లో  శుక్రవారం వరకు మధ్యాహ్న భోజనం ప్రారంభం కాలేదు. స్కూల్ కు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నం సమయంలో ఇంటికి వెళ్లి భోజనం చేసి వస్తున్నారు. ఇతర గ్రామాల నుంచి వచ్చిన వారు లంచ్  బాక్సులు తెచ్చుకుంటున్నారు.

పాఠశాల ప్రారంభమై 15 రోజులు కావస్తున్నా, పాఠశాలలో మధ్యాహ్న భోజనం ప్రారంభం కాలేదని విద్యార్థులు, పేరెంట్స్​ వాపోతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మధ్యాహ్న భోజనం ప్రారంభించాలని కోరుతున్నారు. ఎంఈవో భాస్కర శర్మను సంప్రదించగా, కొత్త వంట ఏజెన్సీని ఏర్పాటు చేసి రెండు రోజుల్లో మధ్యాహ్నం భోజనం ప్రారంభిస్తామని తెలిపారు.