ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే 15 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. నెల్లూరులో 6, కృష్ణాలో 6, చిత్తూరులో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 329 చేరింది. గత రెండు మూడు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య కొద్దిగా తగ్గిందని ఊపిరి పీల్చుకునేలోపు.. మళ్లీ ఈ రోజు 15 కేసులు నమోదుకావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కరోనా బారిన పడిన వారిలో ఇప్పటివరకు ఆరుగురు డిశ్చార్జ్ కాగా.. నలుగురు చనిపోయారు. వైరస్ ప్రభావం కర్నూల్, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు కర్నూల్‌లో అత్యధికంగా 74, నెల్లూరులో 49, గుంటూరులో 41 కేసులు నమోదయ్యాయి.

For More News..

పుష్పతో రాబోతున్న అల్లు అర్జున్

లాక్‌డౌన్ పోకముందే ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం

ఫేక్​ న్యూస్​ వైరల్ ​చేస్తే కేసు బుక్కే!