ఒంటరివాడైపోతున్నాననే బాధతోనే నితీష్ అలా మాట్లాడుతుండు : పీకే

ఒంటరివాడైపోతున్నాననే బాధతోనే నితీష్ అలా మాట్లాడుతుండు : పీకే

పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ మరోసారి జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ లో వయసు పైబడుతున్న లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. అందుకే ఏదో చెప్పాలనుకొని, ఇంకేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఒంటరివాడైపోతున్నాననే బాధతోనే ఆయనలా మాట్లాడుతున్నారన్న ప్రశాంత్ కిషోర్... తాను బీజేపీ ఎజెండాతో పని చేస్తే కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని ఎందుకు అడుగుతానని నిలదీశారు. ఆయనకు మతిభ్రమిస్తోందని, రాజకీయంగా ఒంటరివాడవుతున్నారనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయనకు నమ్మకం లేనివారంతా ఆయన చుట్టూ ఉన్నారని ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ అన్నారు. 

తాను బీజేపీ ఎజెండాతో పనిచేస్తున్నారని నితీష్ ఆరోపిస్తున్నారని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఈ రెండూ ఎలా సాధ్యమవుతాయి? నేను బీజేపీ కోసం పని చేస్తే, కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని ఎందుకు మాట్లాడతాను? అది నిజమైతే, మొదటి స్టేట్‌మెంట్ తప్పవుతుంది కదా అని పీకే ప్రశ్నించారు. తాను ఏనాడూ తన అవసరం కోసం నితీష్ కుమార్ ను కలవలేదన్నారు. తాను బీజేపీ గెలుపు కోసం పని చేస్తున్నానని నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. నితీష్ భ్రమల్లో ఉండి భయపడుతున్నారని ఆరోపించారు.