- అమిత్షాకు తుమ్మల లేఖ
భద్రాచలం, వెలుగు: ఏపీలో ఉన్న ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం లేఖ రాశారు. రెండు రాష్ట్రాల సీఎంలు కూడా చొరవ చూపాలని లేఖలో పేర్కొన్నారు.
ఏపీలో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో లేఖ రాయడం విశేషం. ఏపీ రాష్ట్ర పునర్విభజన కారణంగా భద్రాచలం డివిజన్లో జరిగిన నష్టాన్ని లేఖలో ప్రస్తావించారు. భద్రాచలంను ఆనుకుని ఉన్న ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల, పిచుకులపాడు, కన్నాయిగూడెం పంచాయతీలను తెలంగాణలో కలపడంతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు.
