చనిపోయిన అమ్మానాన్నలు స్క్రీన్ మీద ప్రత్యక్షం

చనిపోయిన అమ్మానాన్నలు స్క్రీన్ మీద ప్రత్యక్షం
  • ఏఐ ద్వారా ఫంక్షన్ లో వీడియో చూసి ఓ బాలిక ఆనందం, ఉద్వేగం
  • తల్లిదండ్రులు చనిపోవడంతో నానమ్మ, తాతయ్యల దగ్గర పెరుగుతున్న పిల్లలు

కరీంనగర్, వెలుగు: ఆ అన్నాచెల్లెలి తల్లిదండ్రులు చిన్నవయసులోనే అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి  నానమ్మ, తాతయ్యే వారి ఆలనాపాలన చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాలిక ఓణీ ఫంక్షన్  నిర్వహించారు. ఆ ఫంక్షన్  హాల్ లో స్క్రీన్ పై బాలిక తల్లిదండ్రులు ఆమెను దీవిస్తూ కనిపించారు. తనకు ఊహ తెలియక ముందే చనిపోయిన అమ్మానాన్నలు.. ఇప్పుడు ఇలా తన ఫంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించడం చూసి ఆ బాలిక సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యింది. నిజంగానే తన కోసం అమ్మానాన్న వచ్చారన్నంత భావోద్వేగంతో కన్నీరుమున్నీరైంది.

బాలికను చూసి.. ఫంక్షన్ హాల్ కు వచ్చిన బంధువులంతా కంటతడి పెట్టారు. ఈ ఘటన కరీంనగర్  సిటీలోని మారుతీనగర్ లో సోమవారం జరిగింది. మారుతి నగర్ కు చెందిన నిమ్మల రామచంద్రం, సుమలత దంపతులకు కుమారుడు మణి, కూతురు మనస్విక ఉన్నారు. అనారోగ్యంతో రామచంద్రం 2018లో, ఆ తర్వాత సుమలత 2020లో చనిపోయారు. దీంతో పిల్లల్లిద్దరి ఆలనాపాలన వారి నానమ్మ, తాతయ్య చూస్తున్నారు. తల్లిదండ్రులు చనిపోయిన సమయంలో మణికి ఆరేళ్లు, మనస్వికి ఐదేళ్లు ఉన్నాయి.

ఈ క్రమంలోనే తాత, నానమ్మ, బంధువులు కలిసి మనస్వికకు కరీంనగర్ లోని ఓ ఫంక్షన్  హాల్ లో చాలా గ్రాండ్ గా ఈ నెల 9న ఓణీ ఫంక్షన్  నిర్వహించారు. చిన్నతనంలోనే అమ్మానాన్నల ప్రేమకు దూరమైన ఆ చిన్నారికి ఆమె నానమ్మ, తాతయ్య, బాబాయ్  కలిసి సర్ ప్రైజ్ ప్లాన్  చేశారు. స్వర్గం నుంచి తల్లితండ్రులు ఆ ఫంక్షన్ కు వచ్చినట్లు, బాలికను హత్తుకున్నట్లు, కుటుంబ సభ్యులతో కలిసి గ్రూప్  ఫొటో దిగినట్లు ఏఐ సాయంతో వీడియో రూపొందించి ఎల్ఈడీ స్క్రీన్  మీద ప్రదర్శించారు. ఒక్కసారిగా తనతో తన తల్లిదండ్రుల వీడియోను చూసిన మనస్విక తీవ్ర భావోద్వేగానికి గురై వెక్కివెక్కి ఏడ్చింది. మనస్వికతో పాటుగా బంధువులంతా వీడియోని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.