అన్నాడీఎంకే పార్టీ నాదే: శశికళ

అన్నాడీఎంకే పార్టీ నాదే: శశికళ

చెన్నైకి చేరుకున్న శశికళ…సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను ప్రజా జీవితంలో ఉంటానని, క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. అంతేకాదు..అన్నాడీఎంకే(AIADMK)పార్టీ తనదేనని కీలక వ్యాఖ్యలు చేశారు.

నాలుగేళ్ల జైలు జీవితం తర్వాత తమిళగడ్డపై అడుగుపెట్టిన శశికళ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె…తాను ఎవరికీ భయపడనన్నారు. తనను వ్యతిరేకించిన వారికి తనేమిటో అర్థమయి ఉంటుందని… అన్నాడీఎంకే పార్టీ నేతలు వణికిపోతున్నారని చెప్పారు. అమ్మ వారసత్వాన్ని తాను కొనసాగిస్తానని చెప్పారు. అంతేకాదు… AIADMK జెండా ఉన్న వాహనంలో శశికళ చెన్నైకి వచ్చారు.