T20 World Cup 2024: కోహ్లీ, శాంసన్ ఔట్.. భారత జట్టు ఎంపిక పట్ల ఫేక్ ప్రచారం

T20 World Cup 2024: కోహ్లీ, శాంసన్ ఔట్.. భారత జట్టు ఎంపిక పట్ల ఫేక్ ప్రచారం

జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ దేశాల వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం భారత్ క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మరికొన్ని గంటల్లో జట్టును ప్రకటించనుంది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన పటిష్ఠమైన టీమ్‌ను ఎంపిక చేయనుంది. ఇప్పుడు క్రికెట్ అభిమానులంతా.. భారత ప్రపంచ కప్ జట్టులో ఎవరికి చోటుదక్కుతుందనే దానిపై నిమగ్నమై ఉంటే.. కొందరు ఆకతాయిలు జట్టు ఎంపిక పట్ల తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు.  

కోహ్లీ, శాంసన్ ఔట్

పొట్టి ప్రపంచ కప్‌‌లో తలపడే  భారత జట్టులో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, భీకర ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదని కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు బీసీసీఐ పేరుతో 15మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను నెట్టింట పోస్టు చేస్తున్నారు.  ఇలాంటి వాటి పట్ల క్రికెట్ అభిమానులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

కాగా, జూన్ 1 నుంచి జూన్ 29 వరకు టీ20 వరల్డ్ కప్ జరగనుంది.  మొత్తం 20 జట్లు ఈ టోర్నీలో  పాల్గొననున్నాయి. ఈ టోర్నీలో భారత జట్టు తన తొలి మ్యాచులో  జూన్ 5 న ఐర్లాండ్‌తో తలపడనుంది.