
పీసీసీలో పలు కమిటీలు నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. మొత్తం ఐదు కమిటీలను ఏర్పాటు చేసింది ఏఐసీసీ. 22 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, 15 మందితో అడ్వైజరీ కమిటీలను ఏర్పాటు చేసింది. తెలగాణకు మొదటి సారి అడ్వైజరీ కమిటీని ఏర్పటు చేసింది అధిష్టానం. ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ సహా కీలక మంత్రులతో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ఆహ్వానితులుగా ఉండనున్నారు. ఏఐసీసీ ఏర్పాటు చేసిన పొలిటికల్ ఎఫైర్స్, అడ్వైజరీ కమిటీలకు మీనాక్షి నటరాజన్ సారథ్యం వహించనున్నారు.
చల్లా వంశీచంద్ రెడ్డి ఛైర్మన్ గా ఏడుగురితో డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేశారు. అదే విధంగా పి.వినయ్ కుమార్ సారథ్యంలో 16 మందితో సంవిధాన్ బచావో కమిటీని నియమించారు.
ఆరు మంది సభ్యులతో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఛైర్మన్ గా మల్లురవి వ్యవహరిస్తారు.
ఏఐసీసీ అదనపు కమిటీల వరకే పరిమితమైంది. పీసీసీ కార్యవర్గం జోలికి మాత్రం పోలేదు. వాస్తవానికి పీసీసీ కార్యవర్గాన్ని కూడా నియమిస్తారనే ఊహాగానాలు వచ్చాయి. కానీ అదనపు కమిటీలను మాత్రమే ఏఐసీసీ నియమించింది.