పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా AIIMSలో దర్నాలు చేయవద్దు

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా AIIMSలో దర్నాలు చేయవద్దు

ఢిల్లీ: పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా… ఆల్ ఇండియా ఇన్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(AIIMS).. ఆవరణలో, బయట దర్నాలు చేయకూడదని హాస్పిటల్ సిబ్బందికి గురువారం మెమోరాండం జారీచేసింది ఢిల్లీ AIIMS.  ఇందుకుగాను స్టాఫ్ కు, ఫ్యాకల్టీ కి, రెసిడెంట్ డాక్టర్లకు, నర్స్ లకు, విద్యార్థులకు నోటీసు ద్వారా తెలియజేసింది. హైకోర్టు సూచనల మేరకు ప్రవర్తించాలని చెప్పింది. డ్యూటీలో ఉన్న ఏ ఒక్కరు మీటింగ్ లు నిర్వహించరాదని, మైక్ లు పెట్టి అరవడాలు, నినాదాలు ఇవ్వడాలు చేయరాదని చెప్పింది. ఏయిమ్స్ కు 500మీటర్ల దూరం వరకు ఇటువంటి చర్యలను అనుమతించబోమని చెప్పారు.