15 సెకన్లు కాదు గంట తీస్కో..నవనీత్ కౌర్కు ఓవైసీ కౌంటర్

15 సెకన్లు కాదు గంట తీస్కో..నవనీత్ కౌర్కు ఓవైసీ కౌంటర్

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో  మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు నేతలు. ఒక్కోసారి సహనం కోల్పోయి హద్దులు మీరి మాట్లాడుతున్నారు. బీజేపీ నేత నవనీత్ కౌర్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

మే 8న హైదరాబాద్ లో  బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలకు ఇవాళ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. 15 సెకన్లు ఎందుకు గంట సమయం తీసుకో.  ముస్లీంలను ఏం చేస్తారో చేయండి..అధికారం మీ దగ్గరే ఉంది. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తం.. మేం భయపడం. చేసి చూపించాలంటూ సవాల్ విసిరారు అసదుద్దీన్.

హైదరాబాద్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాదవీలతకు మద్దతుగా ప్రచారం చేసిన నవనీత్ కౌర్..2012లో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.  15 నిముషాలు పోలీసులు పక్కకు తప్పుకుంటే లెక్కలు సరిచేస్తామని అక్బరుద్దీన్ ఓవైసీ   అన్నారు..కానీ వాళ్లకు 15 నిముషాలేమో...మాకు 15 సెకన్లు చాలు అని నవనీత్ కౌర్ సవాల్ చేశారు.  దీనికి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు.