ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆఫీసర్ల నుంచి గ్రీన్సిగ్నల్
ప్రతిపాదనలు రెడీ చేసిన ఆఫీసర్లు
చౌదర్పల్లి వద్ద ఏర్పాటు చేసే చాన్స్
మహబూబ్ నగర్, నారాయణపేట టౌన్, వెలుగు: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు మంజూరైన మినీ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం వేగంగా కసరత్తు చేస్తోంది. ముందుగా అడ్డాకుల మండలంలో ఏర్పాటు చేయాలని అనుకున్నప్పటికీ టెక్నికల్ రీజన్స్ తో దేవరకద్రకు మార్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సబంధించి ఏవియేషన్ ఆఫీసర్లు సైతం గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్తో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడైతేనే అనువుగా ఉంటుందని నిర్ణయానికి రావడంతో అడుగులు ముందుకు పడుతున్నాయి. వారి ఆదేశాల మేరకు చౌదర్ పల్లి పరిసరాల్లో ఇప్పటికే సర్వే చేసిన అర్అండ్బీ, రెవెన్యూ ఆఫీసర్లు ప్రతి పాదనలు సిద్ధం చేశారు. అయితే ఫ్లడ్, వెదర్ రిపోర్ట్ ను పంపాలని ఆర్ఆండ్బీ సీఈ నుంచి ఉత్తర్వులు అందటంతో రెవెన్యూ ఆఫీసర్లు ఆయా ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.
అడ్డాకుల నుంచి దేవరకద్రకు..
రాష్ట్రంలో 6 చోట్లఎయిర్పోర్టులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలకు కేంద్రం ఒకే చెప్పిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆఫీసర్లు ఉమ్మడి జిల్లాల వారీగా కసరత్తు చేస్తున్నారు. స్థలాల పరిశీలన, ఫ్లడ్, వెదర్, ల్యాండ్ రిపోర్టుల ఆధారంగా ప్రతిపాదనలు ఫైనల్ చేస్తున్నారు. ఉమ్మడి మహబుబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర, మూసాపేట, అడ్డాకులలోని పలు స్థలాలను పరిశీలించారు. అడ్డాకుల మండలంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినా ఆ ప్రాంతం శంషాబాద్ ఎయిర్పోర్టుకు 150 కి.మీ.లోపు ఉండడంతో టెక్నికల్గా సాధ్యం కాలేదు. దీంతో దేవరకద్ర పరిధిలోని చౌదర్ పల్లిలో మొగ్గు చూపారు. ఈ ప్రాంతం ఉమ్మడి జిల్లాకు మధ్యలో ఉండడం, బెంగళూరు హైవే కూడా ఉండడం కలిసి వస్తోందని భావిస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్టులకు సంబంధించి వరంగల్, అదిలాబాద్, జక్రాన్ పల్లి, భద్రాద్రి కొత్తగూడెం, బసంత్ నగర్తో పాటు మహబూబ్నగర్జిల్లాదేవరకద్ర పేరను ఆర్అండ్బీ సీఈ విభాగం నుంచి వచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం.