హైదరాబాద్ లోని సెక్రటేరియట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ ముట్టడికి ముట్టడికి పిలుపునిచ్చింది ఏఐఎస్ఎఫ్ . సెక్రటేరియట్ వైపు వెళ్లేందుకు యత్నించిన ఏఐఎస్ఎఫ్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు , ఏఐఎస్ఎఫ్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. దీంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
ఈ ఘటనలో ఏఐఎస్ఎఫ్ నాయకుడిపై సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు దాడి చేశారు. చెంపపై కొట్టి కాలర్ తో ఈడ్చుకెళ్లారు. ఆందోళనకు వచ్చిన ఏఐఎస్ఎఫ్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. విద్యారంగంలో సమస్యలను నెరవేర్చే వరకు తమ పోరాటం ఆగబోదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.