‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో పాయల్ రాజ్పుత్ను హీరోయిన్గా పరిచయం చేసిన అజయ్ భూపతి.. ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో ‘మంగళవారం’ అనే సినిమా రూపొందిస్తున్నాడు. స్వాతి గునుపాటి, ఎం.సురేష్ వర్మ, అజయ్ భూపతి కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ఫస్ట్ సాంగ్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. శనివారం రెండో పాటను విడుదల చేశారు.
‘ఏమయ్యిందో ఏమిటో.. నిలవనీదు మనసే..’ అంటూ సాగిన మెలోడీ సాంగ్లో పాయల్, అజ్మల్ అమీర్ జంటగా కనిపించారు. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్నాథ్ కంపోజ్ చేసిన పాటను హర్షిక దేవంత పాడింది. ‘ఉండిపోనా.. నీలో నిండిపోనా.. ఆపలేని తపనే.. అల్లుకోనా.. నిన్నే గిల్లుకోనా.. సన్నజాజి లతనై.. నన్ను నీలో కలుపుకోరా.. నువ్వు నాలో కలిసిపోరా’ అంటూ రొమాంటిక్ లిరిక్స్ రాశాడు చైతన్య ప్రసాద్.
విలేజ్ బ్యాక్డ్రాప్లో సాగిన పాటలో పాయల్, అజ్మల్ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ కథలో భాగంగా, కీలక సందర్భంలో వస్తుందని, పాయల్ నేపథ్యానికి, ఈ పాటకు చాలా సంబంధం ఉంటుందని దర్శక నిర్మాతలు చెప్పారు. నవంబర్ 17న తెలుగు, తమిళ,కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది.