
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ నుంచి వస్తున్న సినిమా ‘సన్ ఆఫ్ సర్దార్ 2’. విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహిస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్. జియో స్టూడియోస్ సమర్పణలో అజయ్ దేవగణ్, జ్యోతి దేశ్పాండే నిర్మిస్తున్నారు.
ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్కు సంబంధించి ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్ గురువారం టీజర్ను విడుదల చేశారు. ‘వెల్కమ్ టు ది మ్యాడ్నెస్ ఆఫ్ సర్దార్ అండ్ కో’ అంటూ అజయ్ దేవగణ్ ఈ టీజర్ను షేర్ చేశాడు.
జస్సీ పాత్రలో అజయ్ కనిపించగా, తనకు జంటగా రబియా అనే క్యారెక్టర్లో మృణాల్ కనిపించింది. రవి కిషన్, సంజయ్ మిశ్రా, ముకుల్ దేవ్ కీలకపాత్రల్లో కనిపించారు.
టీజర్లో యాక్షన్ కంటే కామెడీ సీన్స్కు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. పన్నెండేళ్ల క్రితం వచ్చిన ‘సన్ ఆఫ్ సర్దార్’కు ఇది సీక్వెల్ అనే విషయం తెలిసిందే. గత చిత్రంలో పంజాబ్ బ్యాక్డ్రాప్లో జరిగే కథ కాగా ఈసారి స్కాట్లాండ్ బ్యాక్డ్రాప్ను ఎంచుకున్నారు. జులై 25న సినిమా విడుదల కానుంది.