7 రోజులు మాత్రమే సభ.. అక్బరుద్దీన్ అసంతృప్తి

7 రోజులు మాత్రమే సభ.. అక్బరుద్దీన్ అసంతృప్తి

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కేవలం 7 రోజులే నిర్వహించడంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాలు కనీసం 20 రోజులు నిర్వహిస్తే బాగుండేదనని అన్నారు. అలా చేసి ఉంటే కనీసం 25 అంశాలపై స్వల్పకాలిక చర్చ చేసే అవకాశం ఉండేదని అన్నారు. గతేడాది కొవిడ్ కారణంగా అసెంబ్లీ సమావేశాలు కుదించారని, ఈసారి కూడా తక్కువ రోజులే జరపడం సరికాదని అక్బరుద్దీన్ అన్నారు. 2014-18 మధ్య 126 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగితే, 2018 నుంచి ఇప్పటి వరకు 67 రోజులు మాత్రమే సభ కొలువుదీరిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం క్రియాశీలంగా ఉండాలంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేశారు.