‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ రాజ్, త్రిగుణ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈషా’ (Eesha). హెబ్బా పటేల్ హీరోయిన్గా నటించింది. శ్రీనివాస్ మన్నె డైరెక్ట్ చేసిన ఈ హారర్ థ్రిల్లర్ని కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా సోమవారం (డిసెంబర్ 8న) ఈషా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్గా సాగింది. హార్రర్ థ్రిల్లర్లో జానర్లో ఇప్పటివరకు వచ్చిన వాటిలో ఇది కొత్తగా తెరకెక్కినట్టు తెలుస్తోంది. ఆత్మలు, మూఢ నమ్మకాలపై సాగిన సీన్స్ ఆసక్తి రేకేత్తిస్తున్నాయి.
‘మీరు ఇప్పటివరకూ చూడని, ఊహించని చీకటి ప్రపంచం మరొకటి ఉంది’ అనే డైలాగులు భయపెట్టేలా ఉన్నాయి. దానికి తోడు విజువల్స్, సౌండింగ్ సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.
►ALSO READ | Akhanda 2 Update: ‘అఖండ 2’ నిర్మాతల ఇష్యూ క్లియర్.. రిలీజ్ డేట్పై లేటెస్ట్ అప్డేట్ ఇదే!
సాధారణంగా ప్రతి హారర్ థ్రిల్లర్ మూవీస్లో డ్రామా ఎక్కువగా ఉంటుంది. సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటారు. కానీ, ఈ ట్రైలర్ బట్టి చూస్తే.. ఆడియన్స్ ఒక రియలిస్టిక్ ఫీల్తో థియేటర్ నుంచి బయటకు వస్తారని క్లారిటీ మాత్రం ఇచ్చేస్తుంది. రాజు వెడ్స్ రాంబాయితో మంచి సాలిడ్ హిట్ కొట్టిన అఖిల్ రాజ్.. ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకోనున్నాడో చూడాలి.
