
వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికల జరగనున్నాయి. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. ఈ క్రమంలో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.
రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) పార్టీతో సమాజ్ వాదీ పార్టీకి పొత్తు ఉంటుందని చెప్పారు అఖిలేష్ యాదవ్. పొత్తు ఖరారయిందని, సీట్ల పంపకాలపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. తన బాబాయ్ శివపాల్ యాదవ్ కు చెందిన ప్రగతిశీల్ సమాజ్ వాదీ పార్టీ లోహియా (PSPL)తో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని... వారితో కలిసి పని చేయడంలో అభ్యంతరం లేదని చెప్పారు. అఖిలేశ్ యాదవ్ ప్రస్తుతం ఆజంఘర్ నుంచి ఎంపీగా ఉన్నారు.