ప్రగతి భవన్ కు చేరుకున్న అఖిలేశ్ యాదవ్

ప్రగతి భవన్ కు చేరుకున్న అఖిలేశ్ యాదవ్

సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ 2023 జులై 03 సోమవారం హైదరాబాద్ కు చేరుకున్నారు.  బేగంపేట విమానాశ్రమంలో అఖిలేష్ యాదవ్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత బేగంపేట నుంచి అఖిలేష్ యాదవ్ ప్రగతిభవన్ కు చేరుకున్నారు. కాసేపట్లో సీఎం కేసీఆర్ తో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. కేసీఆర్, అభిలేష్ తో సహా ఇతర నేతలు ప్రగతి భవన్ లోనే లంచ్ చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలియజేశాయి. 

జాతీయ రాజకీయాలు, యూనిఫాం సివిల్ కోడ్, వచ్చే సార్వత్రిక ఎన్నికలు తదితర అంశాలపై చర్చించే అవకాశముందని సమాచారం. అనంతరం అఖిలేష్ యాదవ్ తిరిగి యూపీకి వెళ్లిపోతారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.