అఖిల్ పెళ్లికి సీఎం చంద్రబాబుని ఆహ్వానించిన నాగార్జున.. మ్యారేజ్ ఎప్పుడంటే!

అఖిల్ పెళ్లికి సీఎం చంద్రబాబుని ఆహ్వానించిన నాగార్జున.. మ్యారేజ్ ఎప్పుడంటే!

అక్కినేని అఖిల్, తన ప్రియురాలు జైనాబ్ ర‌వ్జీల పెళ్లి శుక్రవారం జూన్ 6న జరగనుందని సమాచారం. ఈ సందర్భంగా హీరో నాగార్జున సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించే పనిలో ఉన్నారు. 

ఈ తరుణంలో నేడు (జూన్3న) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని నాగార్జున కలిశారు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎంని కలిసి.. తన చిన్నకొడుకు అఖిల్ వివాహ ఆహ్వానపత్రికను నాగార్జున అందించారు. ఇటీవలే ఈ వివాహ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించారు నాగార్జున. 

ఇదిలా ఉంటే.. అఖిల్, జైనాబ్ ర‌వ్జీల ఎంగేజ్‍మెంట్ గతేడాది నవంబర్‌లోనే జరిగింది. ఇపుడు వీరి పెళ్లి వేడుక అన్న‌పూర్ణ స్టూడియోలోనే సింపుల్‌గా జ‌ర‌గ‌బోతున్న‌ట్లు స‌మాచారం. అయితే, అఖిల్ పెళ్లి తేదీపై అక్కినేని ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. నాగ‌చైత‌న్య‌, శోభితా ధూళిపాళ్ల పెళ్లి కూడా అన్న‌పూర్ణ స్టూడియోలోనే జ‌రిగింది.