తెలంగాణ వచ్చాక ఒక్క స్కూలూ ఏర్పాటు చేయలే : ​ఆకునూరి మురళి

తెలంగాణ వచ్చాక ఒక్క స్కూలూ ఏర్పాటు చేయలే : ​ఆకునూరి మురళి
  • రాష్ట్రం వచ్చాక ఒక్క స్కూలూ ఏర్పాటు చేయలే
  • మేం ఒత్తిడి చేస్తే ‘మన ఊరు మన బడి’ తీసుకువచ్చిన్రు 
  • గత ఏడాది ఫండ్స్​ ఇయ్యలే...
  • బీఆర్ఎస్, బీజేపీలకు ఓటెయ్యద్దు ​
  • రిటైర్డ్ ​ఐఏఎస్ ​ఆకునూరి మురళి 

 కామారెడ్డి, వెలుగు :  రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోదీ ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేశా యని రిటైర్డ్​ ఐఏఎస్​ ఆఫీసర్​ ఆకునూరి మురళి ఆరోపించారు. తెలంగాణ జాగో పేరిట సాగుతున్న బస్సుయాత్ర సోమవారం కామారెడ్డికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన వాకర్స్​తో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొత్తగా ఒక్క స్కూల్​ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. ఎడ్యుకేషన్ ​హబ్​పేరిట గజ్వేల్​లో షో పుటప్ ​చేశారన్నారు. విద్యా పరిరక్షణ కమిటీ పేరుతో తాము డిమాండ్​ చేస్తే మన ఊరు మన బడి ప్రోగ్రామ్​ తీసుకువచ్చారన్నారు. 

గత సంవత్సరం ‘మన ఊరు మన బడి’కి స్పెషల్​గా బడ్జెట్​లో ఏ మాత్రం నిధులు కేటాయించలేదన్నారు. కేసీఆర్​ సర్కారు తీరుతో 35 లక్షల మంది నిరుద్యోగులు బాధపడుతున్నారన్నారు. ఇంటికో ఉద్యగం అని చెప్పిన కేసీఆర్​ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. పంట పండించే నిజమైన రైతులకే రైతుబంధు ఇవ్వాలని, సినిమా హీరోలకు రైతు బంధు అవసరమా? అని ప్రశ్నించారు. ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ ​వన్ ఆఫీసర్లు కూడా రైతులా ? అని నిలదీశారు. బీఆర్ఎస్​, బీజేపీలకు ఓటు వేయవద్దన్నారు. తాము ఏ పార్టీకి సపోర్టు కాదని, ప్రజలను చైతన్యవంతం చేస్తున్నామన్నారు.

ప్రతినిధులు లక్ష్మీనారాయణ, నైనాల గోవర్ధన్​ ఉన్నారు. కాగా, కామారెడ్డిలో వాకర్స్​తో మాట్లాడుతున్న  టైంలో  ఎన్నికల ఆఫీసర్లు వచ్చి అడ్డు చెప్పారు. తర్వాత బస్టాండ్ ​దగ్గర మీటింగ్​నిర్వహించాల్సి ఉండగా పర్మిషన్ ​లేదన్నారు. అన్ని జిల్లాలు తిరుగుతున్నామని, పర్మిషన్​ తీసుకున్నామని చెప్పగా.. మైక్​ పర్మిషన్ ​లేదని అభ్యంతరం తెలిపారు. వినకపోతే సుమోటోగా కేసు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు.