హైదరాబాద్: ఈ ఏడాది సంక్రాంతికి ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో సైలిష్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో నాన్ బాహుబలి రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ఈ ఫిల్మ్ ఫుల్ థియేట్రికల్ రన్లో వరల్డ్వైడ్గా రూ.150 కోట్ల రెవెన్యూను సాధించింది. యునైటెడ్ స్టేట్స్లో 3 మిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించిన 8వ సౌత్ ఇండియన్ సినిమాగా నిలిచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆల్టైమ్ హయ్యస్ట్ గ్రాసర్స్లో 3వ ప్లేస్ దక్కించుకుంది. ఏడు నెలల థియేట్రికల్ రిలీజ్తోపాటు ఆరు నెలల ఓటీటీ రన్ అనంతరం ఇండిపెండెన్స్ డే స్పెషల్గా టీవీలో విడుదలైంది. టీవీలో ప్రసారమైన ఈ మ్యూజిక్ బ్లాక్బస్టర్ 29.4 టీఆర్పీ రేటింగ్స్తో తెలుగు ఇండస్ట్రీలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ సినిమాపై అద్భుతమైన స్పందనకు, ప్రేమను కురిపించినందుకు ప్రేక్షకులకు మప్పిదాలు చెబుతూ గీతా ఆర్ట్స్ సదరు రికార్డు గురించి ట్విట్టర్లో ట్వీట్ చేసింది.
It has been 7 months post Theatrical release and 6 months post OTT release. Still #AVPL managed to set a RECORD BREAKING-HIGHEST TRP – 29.4 for any Telugu Film ever. Thank you for such a phenomenal response & love. ???#AVPLAllTimeRecordTRP @alluarjun #Trivikram @hegdepooja pic.twitter.com/dvfuKPdtOQ
— Geetha Arts (@GeethaArts) August 27, 2020