పోచర్‌‌‌‌‌‌‌‌ వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ విడుదల

పోచర్‌‌‌‌‌‌‌‌ వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ విడుదల

హీరోయిన్‌‌‌‌గానే కాక నిర్మాతగానూ బిజీ అవుతోంది అలియాభట్. ఎటర్నల్ సన్‌‌‌‌షైన్ ప్రొడక్షన్స్‌‌‌‌ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించిన ఆమె, కరణ్ జోహార్‌‌‌‌‌‌‌‌తో కలిసి ‘జిగ్రా’ అనే సినిమాను నిర్మిస్తోంది. మరోవైపు ‘పోచర్‌‌‌‌‌‌‌‌’ అనే వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌కు కో ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించింది. నిమిషా సజయన్, రోషన్ మ్యాథ్యూ, దివ్యేంద్ర భట్టాచార్య లీడ్‌‌‌‌ రోల్స్‌‌‌‌లో న‌‌‌‌టించిన ఈ వెబ్ సిరీస్‌‌‌‌ను రిచీ మెహతా డైరెక్ట్‌‌‌‌ చేశారు. తాజాగా ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.

ఏనుగు దంతాల స్మగ్లింగ్‌‌‌‌, వన్య ప్రాణులపై దాడులు చేసే వారి నేపథ్యంలో తెరకెక్కించిన క్రైమ్ సిరీస్‌‌‌‌ అని అర్థమవుతోంది.  ఏనుగు దంతాల వేటగాళ్లను ఫారెస్ట్‌‌‌‌ అధికారులు, లోకల్ పోలీసులు, ఎన్‌‌‌‌జీవో వర్కర్స్ కలిసి ఎలా పట్టుకున్నారనేది మెయిన్ కాన్సెప్ట్‌‌‌‌. మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌‌‌‌గా ఇది రానుంది. క్యూసీ ఎంటర్‌‌‌‌టైన్‍మెంట్ సంస్థ నిర్మించింది. గురువారం జరిగిన ట్రైలర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌కు హాజరైన అలియాభట్ ఇలాంటి ఓ మంచి వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌లో భాగమవడం సంతోషంగా ఉందని చెప్పింది. ఈ నెల 23 నుంచి ఇది అమెజాన్‌‌‌‌ ప్రైమ్‌‌‌‌లో స్ట్రీమింగ్ కానుంది.