భారత జాగృతి కమిటీలన్నీ రద్దు

భారత జాగృతి కమిటీలన్నీ రద్దు

 హైదరాబాద్, వెలుగు: భారత జాగృతిలోని అన్ని కమిటీలనూ జాగృతి గౌరవ వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత రద్దు చేశారు. భారత జాగృతిలోని విదేశీ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ రద్దు వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.