మిరప పంటకు నీరందించాలి

మిరప పంటకు నీరందించాలి

పెబ్బేరు, వెలుగు: మండలంలోని వివిధ గ్రామాల్లో వేసిన మిరప పంట ఎండిపోకుండా జూరాల అధికారుల ఎడమ కాలువ డీ19 కు నీటిని వదలాలని ఆల్​ పార్టీస్​ నాయకులు, రైతులు డిమాండ్​ చేశారు.

సోమవారం పెబ్బేరు పీజేపీ క్యాంప్​లోని ఎస్ఈ సత్య శీలారెడ్డిని కలిశారు. మండలంలోని బున్యాదిపూర్, బూడిదపాడు, జనుంపల్లి, సుగూరు, కొత్త సూగూరు, పెంచికలపాడు, మునగమాన్​దిన్నె గ్రామాల్లో రైతులు మిరప పంట వేసుకున్నారని, పంట ఎండకుండా ఫిబ్రవరి మొదటి వారం వరకు నీటిని విడుదల చేయాలని కోరారు. వెంకటరమణ, శ్రీనివాస్​ గౌడ్, గోవింద్​నాయుడు, శేఖర్, వనం రాములు, తిరుపతయ్య 
పాల్గొన్నారు.