
నిహారిక కొణిదెల సమర్పణలో అందరూ కొత్త వాళ్లతో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. శుక్రవారం సినిమా విడుదలవుతోన్న సందర్భంగా నిహారిక మాట్లాడుతూ ‘కథ విన్న తర్వాత కచ్చితంగా ఈ సినిమా నిర్మించాలనుకున్నా. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే జాతర చుట్టూ ఈ కథను రాసుకున్నాడు వంశీ. సిటీలో పుట్టి పెరిగిన నేను ఎప్పుడూ జాతర ఎక్స్పీరియెన్స్ చేయలేదు.
కానీ కళ్లకు కట్టినట్టుగా చూపించాడు. పదకొండు మంది అబ్బాయిలను హీరోలుగా పరిచయం చేయడం హ్యాపీగా ఉంది. సినిమాను చూసే ప్రతీ ఆడియెన్ ఏదో ఒక క్యారెక్టర్తో ట్రావెల్ చేస్తారు. ప్రతీ ఒక్కరూ సినిమాకు కనెక్ట్ అవుతారు. అనుదీప్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణం. ఇక చిన్న పాత్ర అని, చిన్న హీరో అని కూడా ఆలోచించను. కథ బాగుండి.. పాత్ర నచ్చితే ఏ సినిమాలో అయినా నటిస్తాను’ అని చెప్పింది.