- డీజీపీకి ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్ అమలు చేస్తున్న జీవో 3ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 8న ధర్నాచౌక్లో తలపెట్టిన దీక్షకు పర్మిషన్ ఇవ్వాలని డీజీపీకి ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె డీజీపీ రవిగుప్తాతో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జీవో 3 వల్ల అమ్మాయిలకు అన్యాయం జరుగుతున్నదని, ఇది చాలా ముఖ్యమైన అంశమని డీజీపీకి వివరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు భారత జాగృతి నేతృత్వంలో ధర్నా చేస్తున్నామని, ఇందుకోసం పర్మిషన్ ఇవ్వాలని కోరారు. శాంతియుతంగానే తాము దీక్ష చేస్తామని హామీ ఇచ్చారు.