Allu Arjun: వైజాగ్లో పుష్పరాజ్ మాస్ ఎంట్రీ.. భారీగా వచ్చిన అభిమానులు

Allu Arjun: వైజాగ్లో పుష్పరాజ్ మాస్ ఎంట్రీ.. భారీగా వచ్చిన అభిమానులు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం పుష్ప 2 (Pushpa2) షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కిస్తున్నాడు. పుష్ప సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో పుష్ప 2ని మరింత పకడ్బందీగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇటీవలే రామోజీ ఫిలిం సిటీలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న పుష్ప 2.. నెక్స్ట్ షెడ్యూల్ కోసం  వైజాగ్ కి షిఫ్ట్ అవుతోంది. షూటింగ్ లో భాగంగాగే నేడు వైజాగ్ చేరుకున్నారు అల్లు అర్జున్.

అల్లు అర్జున్ వైజాగ్ వస్తున్నాడన్న విషయం తెలియడంతో భారీ ఎత్తన అభిమానులు ఎయిర్‌పోర్ట్ కి చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్ నుండి నుంచి బన్నీ ఉండే హోటల్ వరకు భారీ బైక్ ర్యాలీతో తీసుకెళ్లారు. ర్యాలీ మధ్యలో అల్లు అర్జున్ పై పూల వర్షం కురిపించారు. ఇక కారు నుండి బయటకు వచ్చిన బన్నీ అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగరు. దీంతో వైజాగ్ రోడ్లన్నీ అభిమానులతో నిండిపోయాయి. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ALSO READ :- బీఆర్ఎస్ పాలనలో ఐటీడీఏలు నిర్వీర్యం : మంత్రి సీతక్క

ఇక మార్చ్ 11 నుండి వైజాగ్ పోర్ట్ లో పుష్ప 2 షూటింగ్ జరగనుంది.  ఈ షెడ్యూల్ తో దాదాపు సినిమా షూటింగ్ పూర్తి కానుంది. మరో మూడు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకొని ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.