ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్ (Pushpa the Rule). ఈ సినిమా కోసం ఐకాన్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొదటి పార్ట్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో.. పుష్ప పార్ట్ 2 పై అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ ఫుల్ స్వింగ్లో జరుగుతోంది. ఆల్రెడీ సెకండ్ పార్ట్ గ్లింప్స్, పోస్టర్ రిలీజ్తో అంచనాలు అమాంతం పెరిగాయి. అంతేకాకుండా..ఈ సినిమా లీక్స్ కూడా మధ్య మధ్యలో దర్శనం ఇస్తూ..ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి.
ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్స్ ను ఒకప్పటి జానీ మాస్టర్ అసిస్టెంట్..ఇప్పటి కోరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ(Shrasti Verma) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫ్యాన్స్ విన్నది..తెలుసుకున్నది చిన్న న్యూస్ అయిన..క్షణాల్లో వైరల్ గా మారింది. ఎందుకంటే, గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ ని శ్రేష్ఠి కోరియోగ్రాఫ్ చేసింది. దీంతో తన సోషల్ మీడియాలో పుష్ప 2 షూటింగ్ వివరాలను పంచుకుంది.
'40 రోజుల పాటు జరిగిన మోస్ట్ ఇంపాక్ట్ బుల్ ఎపిసోడ్ ఆన్ స్క్రీన్ పైన దాదాపు 12 నిమిషాల పాటు ఉంటుందని తెలిపింది. పుష్ప 2 సినిమాకే ఈ ఎపిసోడ్ స్పెషల్ హైలైట్గా నిలుస్తుందని సినిమా ఇండస్ట్రీ నుంచి టాక్ వినిపిస్తూనే వచ్చింది. ఇక శ్రేష్ఠి కోరియోగ్రాఫర్ తన మాటల్లో ఆఫీసియల్గా తెలుపడంతో ఈ న్యూస్ వైరల్ అవుతుంది.
ప్రస్తుతం పుష్ప 2 నెక్స్ట్ షెడ్యూల్ కోసం విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ లేటెస్ట్ షెడ్యూల్ కోసం త్వరలో పుష్ప రాజ్ ఫ్లైట్ ఎక్కబోతున్నట్లు సమాచారం. అలాగే, ఈ ఎపిసోడ్ లో యాక్షన్ సీక్వెన్స్ తో పాటు..కొన్ని కీలకమైన సీన్స్ అక్కడే షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ జపాన్ షెడ్యూల్ కూడా పుష్ప 2 లో హైలెట్ గా నిలిచేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఏదేమైనా గంగమ్మ తల్లి అవతారంతో పుష్ప రాజ్ ఎంట్రీ ఇచ్చిన మొదలు..ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
డైరెక్టర్ సుకుమార్ రైటింగ్స్..మైత్రీ మూవీమేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న రిలీజ్ కాబోతుంది. దేవిశ్రీప్రసాద్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, ధనుంజయ, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.