ఎర్ర చందనం స్మగ్లర్లపై అల్లు అర్జున్ కొత్త చిత్రం

ఎర్ర చందనం స్మగ్లర్లపై అల్లు అర్జున్ కొత్త చిత్రం

స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటీవ్ డైరక్టర్ సుకుమార్ డైరక్షన్ లో , మైత్రీ మూవీ మేకర్స్ క్రేజీ కాంబోలో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

నాపేరు సూర్య నాఇల్లు ఇండియా సినిమా తరువాత ఏడాదిన్నర పైగా ఖాళీగా ఉన్న బన్నీవరుస సినిమాలతో బిజీ అయ్యాడు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరక్షన్ లో అల..వైకుంఠపురంలో యాక్ట్ చేస్తున్నాడు.  చిత్ర షూటింగ్ త్వరగా పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేసేందుకు ఆ చిత్ర దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఆల..వైకుంఠపురం సినిమా సెట్స్ పై ఉండగానే బన్నీ.. సుకుమార్ డైరక్షన్ లో మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. ఈ సినిమాలో సాండల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది.

ఆర్య, ఆర్య2 సినిమాల తరువాత సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.  రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం బన్నీ మేకోవర్ అవుతున్నాడు.