పుష్పరాజ్ టార్గెట్ ఫిక్స్.. కొడితే రూ.1000 కోట్లు గ్యారంటీ!

పుష్పరాజ్ టార్గెట్ ఫిక్స్.. కొడితే రూ.1000 కోట్లు గ్యారంటీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం ఫుల్ ఫోకస్ గా ఉన్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం పుష్ప ది రూల్(Pushpa The Rule). స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు కంటే ఎక్కువగా హిందీలో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నార్త్ పుష్పరాజ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాటింది మరి. నిజం చెప్పాలంటే.. పుష్ప పార్ట్ 1కి తెలుగులో కంటే హిందీలోనే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్స్ కూడా అక్కడే ఎక్కువగా వచ్చాయి. దీంతో ఏ హిందీ సినిమాకు లేనంత క్రేజ్ ఏర్పడింది పుష్ప పార్ట్ 2పై. 

అందుకే అల్లు అర్జున కూడా ఈ సినిమాపై చాలా ఫికస్డ్ గా ఉన్నారట. ఇక ఈ సినిమాకున్న క్రేజ్ కి రూ.1000 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరుగుతుందని అంచనా. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనియ్యాంగా మారింది. ఒక తెలుగు సినిమాకు ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం అంటే మాములు విషయం కాదు. అది కేవలం అల్లు అర్జున్ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ వల్లే జరుగుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 కోసం మరింత కేర్ తీసుకుంటున్నారట. ఈ సినిమాతో ఎలాగైనా రూ.1000 కోట్ల క్లబ్ లో చేరాలని చూస్తున్నారట. ఇప్పటికే.. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ ఫీట్ సాధించి లిస్టులో టాప్ లో ఉన్నారు. తాను కూడా సింగల్ గా వచ్చి ఆ రేర్ ఫీట్ ను సాధించాలని చూస్తున్నారట. 

ఇక పుష్ప పార్ట్2 విషయానికి వస్తే.. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.