కాంగ్రెస్లో చేరిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి

కాంగ్రెస్లో చేరిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి

లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి.  సినిమా యాక్టర్ అల్లు అర్జున్ మామ, కంచర్ల  చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో పాటు పట్నం సునీతా రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కూడా  కాసేపటి క్రితమే  కాంగ్రెస్ లో చేరారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ ఇన్ ఛార్జ్  దీపదాస్ మున్షీ వారికి పార్టీ కండువా కప్పారు. పార్టీలో చేరిక తర్వాత అసెంబ్లీకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు.

ALSO READ : కాంగ్రెస్లో చేరిన పట్నం సునీతారెడ్డి, బొంతు రామ్మోహన్

నల్గొండ జిల్లాకు చెందిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి 2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ లో ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ లో చేరారు.  ఇబ్రహీంపట్నం, నాగార్జున సాగర్ నియోజక వర్గాల్లో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.  గత  అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి  ఇబ్రహీంపట్నం, నాగార్జున సాగర్ టికెట్ ఆశించారు. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మల్కాజ్ గిరి ఎంపీకి పోటీ చేస్తారనే  ప్రచారం జరుగుతోంది.