
కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్సమీపంలో గురువారం నిజామాబాద్ఎక్సైజ్ఎన్ఫోర్స్మెంట్టీమ్ రెండుకిలోల 100 గ్రాముల అల్ఫ్రాజోలం పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.20 లక్షల వరకు ఉంటుందని ఎక్సైజ్ఆఫీసర్లు తెలిపారు. రాజస్థాన్నుంచి కామారెడ్డికి ఈ మత్తు పదార్థాన్ని తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో ఎక్సైజ్,ఎన్ఫోర్స్మెంట్ఆఫీసర్లు నిఘా పెట్టారు. టీఎస్08జెవై0025 వ్యాగనార్కారులో ఈ మత్తు పదార్థం పట్టుబడింది. దాడిలో రాజస్థాన్కు చెందిన భవానీసింగ్పట్టుబడగా, అదే రాష్ట్రానికి చెందిన ముఖేశ్సింగ్, హైదరాబాద్కు చెందిన సుదర్శన్పరారీ అయ్యారు.