నేపాల్ లో హెలికాప్టర్ కుప్పకూలింది. బుధవారం ( అక్టోబర్29) హిమాలయ పర్వత ప్రాంతాల్లోని సొలుఖుంబ్ ప్రాంతంలో హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ అయింది. ఈ ప్రమాదంలో పైలట్ సేఫ్ గా బయటపడ్డాడు.
ఉదయం విదేశీ పర్యాటకులను తీసుకెళ్లేందుకు లుక్లా నుంచి బయలుదేరిన హెలికాప్టర్ లోబుచే హెలిప్యాడ్ దగ్గర ల్యాండ్ అవుతుండగా మంచు మీద జారిపడటంతో ప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో ఉన్న కెప్టెన్ వివేక్ ఖడ్కా కు గాయాలయ్యాయి. మరో ఎయిర్ హెలికాప్టర్ లో లుక్లాకు తరలించారు. భారీగా మంచు పడటంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు.
