హైదరాబాద్, వెలుగు: అమెజాన్ ఇండియా తన సెల్లర్ల ఫీజులను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. రూ. వెయ్యి లోపు ధర కలిగిన 12.5 కోట్ల ఉత్పత్తులకు జీరో రిఫరల్ ఫీజు సౌకర్యం ఉంటుంది. దాదాపు1,800 కంటే ఎక్కువ కేటగిరీలలో ఈ వెసులుబాటు అందుబాటులో ఉంటుంది.
రూ. 300 లోపు ధర కలిగిన ఉత్పత్తులపై ఈజీ షిప్ ఫీజును 20 శాతానికిపైగా తగ్గించింది. ఒకే బాక్సులో ఒకటి కంటే ఎక్కువ వస్తువులను పంపే వాళ్లు రెండో వస్తువుపై సెల్లింగ్చార్జీలపై 90 శాతం కంటే ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. ఈ కొత్త నిబంధనలు ఈ నెల 16 నుంచి అమల్లోకి వస్తాయని అమెజాన్ ప్రకటించింది.
మొదలైన ఈపీఎల్ సేల్
అమెజాన్ శుక్రవారం నుంచి ఎలక్ట్రానిక్స్ ప్రీమియర లీగ్ (ఈపీఎల్) ప్రారంభించింది. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లపై 65 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై రూ. 4,500 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. శామ్సంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా, యాపిల్ 17ఈ వంటి తాజా మోడళ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. కస్టమర్లకు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడంలో రఫూస్ వంటి ఏఐ టూల్స్ సహాయపడతాయి. ఈ సేల్ మార్చి 12 వరకు కొనసాగుతుందని కంపెనీ తెలిపింది.
