- హైదరాబాద్లో ఆర్ అండ్ డీ సెంటర్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: అమెరికాకు చెందిన మైక్రోచిప్ టెక్నాలజీ మనదేశంలో 300 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.2,458 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించడానికి, ఇంజనీరింగ్ ల్యాబ్ల ఏర్పాటుకు, కొత్త ట్యాలెంట్ను నియమించుకోవడం వంటి పనుల కోసం ఈ డబ్బును వాడుతుంది. బెంగళూరు, చెన్నై ఫెసిలిటీలను కూడా అభివృద్ధి చేయనుంది. ఇండస్ట్రియల్, డేటా సెంటర్ కంప్యూటింగ్, ఆటోమోటివ్, కన్జూమర్ అప్లయెన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ సెక్టార్లకు ఈ కంపెనీ సెమీకండక్టర్లను, ఎలక్ట్రానిక్స్ పరికరాలను అందజేస్తోంది. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఆర్ అండ్ డీ సెంటర్ను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు.
కోకాపేటలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్.. ఇంజనీరింగ్ ల్యాబ్లను విస్తరించడం, భారతదేశంలోని కస్టమర్లకు టెక్నికల్, బిజినెస్ సపోర్ట్ను అందించడానికి సాయపడుతుంది. ఇందులో వెయ్యి మంది పనిచేస్తారు. మైక్రోచిప్కు మనదేశంలో దాదాపు 2,500 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇది సెమీకండక్టర్ డిజైన్ డెవలప్మెంట్, సేల్స్, సపోర్ట్, ఐటీ ఇన్ఫ్రా , అప్లికేషన్ ఇంజనీరింగ్ సేవలను అందిస్తోంది. కంపెనీకి మనదేశంలో రెండువేల మందికిపైగా కస్టమర్లు ఉన్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలలో దీనికి ఆఫీసులు ఉన్నాయి.