- అజిత్ పవార్ను ఉద్దేశించి అమిత్ షా కామెంట్
పుణె: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్పవార్ఆదివారం పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా అజిత్పవార్ను ఉద్దేశించి షా మాట్లాడుతూ..‘మీరు చాలాకాలం తర్వాత కరెక్ట్ ప్లేస్లో ఉన్నారు. కానీ చాలా లేటుగా వచ్చారు’ అని కామెంట్ చేశారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఫౌండర్ శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ జులై 2న ఎన్సీపీని వీడారు. ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే సారథ్యంలోని అధికార శివసేన, బీజేపీ కూటమిలో చేరారు.
అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా, చగన్ భుజ్బల్, దిలిప్ పాటిల్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. నెల రోజుల అనంతరం అమిత్ షా, అజిత్ పవార్ తొలిసారి పబ్లిక్ ప్రోగ్రామ్లో పాల్గొన్నారు. సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్(సీఆర్సీఎస్) ఆఫీస్ డిజిటల్ పోర్టల్ను అమిత్ షా ఆదివారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేతోపాటు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా అటెండ్ అయ్యారు.