ఆలస్యమైనా సరైన చోటుకు చేరారు

ఆలస్యమైనా సరైన చోటుకు చేరారు
  • అజిత్​ పవార్​ను ఉద్దేశించి అమిత్​ షా కామెంట్​

పుణె: కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్​పవార్​ఆదివారం పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా అజిత్​పవార్​ను ఉద్దేశించి షా మాట్లాడుతూ..‘మీరు చాలాకాలం తర్వాత కరెక్ట్ ప్లేస్​లో ఉన్నారు. కానీ చాలా లేటుగా వచ్చారు’ అని కామెంట్​ చేశారు. 

నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ ఫౌండర్​ శరద్​ పవార్​ మేనల్లుడు అజిత్​ పవార్​ జులై 2న ఎన్సీపీని వీడారు. ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్రలో ఏక్​నాథ్​ షిండే సారథ్యంలోని అధికార శివసేన, బీజేపీ కూటమిలో చేరారు. 

అజిత్ ​పవార్​ డిప్యూటీ సీఎంగా, చగన్​ భుజ్​బల్, దిలిప్​ పాటిల్​ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. నెల రోజుల అనంతరం అమిత్ ​షా, అజిత్​ పవార్​ తొలిసారి పబ్లిక్​ ప్రోగ్రామ్​లో పాల్గొన్నారు.  సెంట్రల్​ రిజిస్ట్రార్​ ఆఫ్​ కోఆపరేటివ్​ సొసైటీస్​(సీఆర్​సీఎస్) ఆఫీస్ డిజిటల్​ పోర్టల్​ను అమిత్ ​షా ఆదివారం ప్రారంభించారు. 

ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్​ షిండేతోపాటు డిప్యూటీ సీఎం అజిత్​ పవార్​ కూడా అటెండ్​ అయ్యారు.