హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాసిన ‘రాజకీయాల్లో బీజేపీ ఎందుకు’ అనే బుక్ను బీజేపీ ఓబీసీ పాలసీ అండ్ రీసెర్చ్ స్టేట్ కన్వీనర్ సూర్యపల్లి శ్రీనివాస్ తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. ఈ బుక్ను సోమవారం బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ బర్త్డే సందర్భంగా గాంధీనగర్లోని ఆయన ఇంట్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అలె భాస్కర్ రాజ్, ఓబీసీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పూస రాజు, ఓబీసీ మోర్చా కార్యదర్శి సంజయ్ ఘనతే, కరణ్, గడీల శ్రీకాంత్ గౌడ్, నందనం దివాకర్, తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మణ్కు మోదీ, అమిత్ షా బర్త్డే విషెస్
బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ఆయనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పలువురు జాతీయ, రాష్ట్ర నేతలు శుభాకాంక్షలు చెప్పారు. మోదీ లెటర్ ద్వారా విషెస్ తెలియజేయగా.. అమిత్ షా, ఓం బిర్లా ఫోన్ ద్వారా విష్ చేశారు.