ఓల్డ్​బాటిల్​లో ఓల్డ్​ వైన్ .. ప్రతిపక్షాల కూటమిపై అమిత్ షా

ఓల్డ్​బాటిల్​లో ఓల్డ్​ వైన్ ..  ప్రతిపక్షాల కూటమిపై అమిత్ షా

మన్​సా: కేంద్ర హోం మంత్రి అమిత్​షా ఆదివారం ప్రతిపక్షాల నేతలపై ఫైర్​అయ్యా రు. ప్రతిపక్షాల కూటమిని ఓల్డ్​ బాటిల్​లో ఉన్న ఓల్డ్ వైన్​అని కామెంట్​చేశారు. రూ.12లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన నేతల కూటమిగా ప్రతిపక్ష ఇండియాను షా ఆరోపించారు. గుజరాత్ గాంధీనగర్​జిల్లాలో మన్​సా పట్టణంలో నేషనల్​ సెక్యూరిటీ గార్డ్​(ఎన్ఎస్​జీ) ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో అమిత్​షా మాట్లాడుతూ..2024 లోక్​సభ ఎన్నికల ముందు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనేందుకు 26 ప్రతిపక్ష పార్టీలు ఇండియన్​ నేషనల్ డెవలప్​మెంటల్​ ఇన్​క్లూసివ్ అలయన్స్ (ఇండియా)పేరుతో కూటమిగా కలిశాయన్నారు. యూపీఏ, కాంగ్రెస్, కూటమి నేతలు 12లక్షల కోట్ల అవినీతికి పాల్పడి ప్రస్తుతం పేరు మార్చుకుని మన ముందుకొచ్చారన్నారు.