వికరాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్న ఆడియో..

వికరాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్న ఆడియో..

వికారాబాద్ జిల్లాలో అక్రమ మట్టి మైనింగ్ దందా జోరుగా సాగుతుంది. ఇందుకు సంబంధించిన ఓ ఆడియో కాల్ స్థానికంగా కలకలం రేపుతుంది. వికారాబాద్ జిల్లా పరిగిలో ఓ మట్టి వ్యాపారి అక్రమంగా దందా చేస్తున్నాడు. స్వచ్ఛంద సంస్థ పేరుతో మట్టి వ్యాపారికి ఓ వ్యక్తి కాల్ చేసి రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తాను అడిగినంత ఇస్తే మట్టి దందాలోకి ఎవర్నీ రానివ్వకుండా చూసుకుంటానంటూ హామీ ఇచ్చాడు. 

 మట్టి వ్యాపారి రూ. 20 వేలు ఇస్తానని చెప్పాడు. రూ. 30 వేలు ఇచ్చి వ్యాపారం చేసుకోవాలని తెలిపాడు. స్వచ్చంధ సంస్థ పేరుతో కాల్ చేసిన వ్యక్తి.. ఎమ్మార్వో, ఎస్ఐ సీఐ, డీఎస్పీ ఎవరు వచ్చినా తాను చూసుకుంటానని చెప్పాడు. ఈ మొత్తం ఆడియోలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఆడియో జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది.