అత్తాపూర్​లో డెడ్​బాడీ కలకలం..

అత్తాపూర్​లో డెడ్​బాడీ కలకలం..

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్​లో గుర్తు తెలియని మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్ మీరాలమ్​ చెరువులో డెడ్​బాడీ ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. సమాచారాన్ని పోలీసులకు అందించారు. 

రంగంలోకి దిగిన అత్తాపూర్​ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డెడ్​బాడీని బయటకి తీయించి పోస్ట్ మార్టం ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరైనా చంపి పడేసి ఉంటారా.. సూసైడ్​ఆ అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

అయితే ఇటీవల నగరంలో గుర్తు తెలియని మృతదేహాలు తరచూ లభ్యం అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.