
అనంతపురంలోని లేపాక్షి ప్రధాన ఆలయాన్ని ఆలయ అధికారులు ఇవాళ్టి (శుక్రవారం) నుండి మూసేశారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.దీంతో ముందస్తు జాగ్రత్తగా అధికారులు అలర్టయ్యారు. కేంద్ర పురావస్తు ఆధీనంలో ఉన్న దేవాలయాల్లో దర్శనాలను నిలిపివేయాలని అధికారులు ఆదేశించడంతో లేపాక్షి ప్రధాన ఆలయాన్ని ఆలయ అధికారులు మూసేశారు.