
మ్యాడ్ ఫేమ్' అనంతిక సనీల్ కుమార్ లీడ్ రోల్లో ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘8 వసంతాలు’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మించారు. ఈ మూవీ జూన్ 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా నేడు (జూన్ 15న) ‘8 వసంతాలు’ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఒక అమ్మాయి జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల ఆధారంగా సినిమా తెరకెక్కింది.
హృదయాన్ని కదిలించే ప్రేమ గాథతో ఈ ట్రైలర్ సాగింది. చీర కట్టుకుని ప్లెజెంట్ లుక్ లో ఆకట్టుకుంది అనంతిక. అలాగే ఎమోషనల్ స్కీన్స్ లో తనదైన పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఈ ట్రైలర్ లో సాగిన డైలాగ్స్.. ఒక్కోటి ఒక్కో అద్భుతం అనేలా ఉన్నాయి.
'చూడమ్మా ఆడవాళ్లు నిప్పు పట్టకూడదు.. కర్మకాండలు, అంత్యక్రియలకు వాళ్లు పనికిరారు'.. 'పనికిరరా.. పేగు పంచి ప్రాణం పోయగలిగిన వాళ్ళం.. చితి ముట్టించి మోక్షం ఇప్పించలేమా? అనే డైలాగ్తోనే సినిమా ఎలా ఉండబోతుందనేది తెలిసిపోయింది. ‘మగాడి ప్రేమకు సాక్ష్యాలుగా పాలరాతి సౌధాలు, భాగ్యనగరాలు ఉన్నాయి. ఆడదాన్ని ప్రేమకు ఏమున్నాయ్.. మనసులో పాతిపెట్టిన జ్ఞాపకాలు తప్ప..’ అని చివర్లో చెప్పిన డైలాగ్ తో.. సినిమా ఎలాంటి లోతుని చెప్పబోతుందో అర్ధమవుతుంది.
అలాగే, ‘అమ్మాయిలకి కత్తి పట్టుకుని రౌద్ర రసం చూపేవాడు కంటే.. కన్నీళ్లు తుడుస్తూ కరుణ రసం చూపించేవాడు అంటేనే ఇష్టం’ అనే డైలాగ్ యూనివర్సల్గా కనెక్ట్ అవుతోంది. ‘ప్రేమ చేరుకోవడానికి ఒక గమ్యం కాదు, మనం చేయాల్సిన ప్రయాణం’ అనే హార్ట్ టచ్చింగ్ డైలాగ్ సినిమాలోని ఎమోషనల్ డెప్త్ని తెలియజేస్తోంది.
మధురం షార్ట్ ఫిల్మ్తో ఎంతోమంది ప్రేమికులకు దగ్గరైన ఫణీంద్ర నర్సెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో తనలోని మరోకొత్త కోణాన్ని పరిచయం చేయనున్నాడు ఫణీంద్ర. ఇందులో హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బాప్రగడ ఇతర పాత్రలు పోషించారు.హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించాడు.