పాయల్ రాజ్‌‌పుత్, అనసూయ కలిసి రిలీజ్ చేసిన తంత్ర పాట

పాయల్ రాజ్‌‌పుత్, అనసూయ కలిసి రిలీజ్ చేసిన తంత్ర పాట

అనన్య నాగళ్ల లీడ్ రోల్‌‌లో శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘తంత్ర’. శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్​ రఘుముద్రి కీలక పాత్ర పోషిస్తుండగా,  సలోని రీ ఎంట్రీ ఇస్తోంది. పి.నరేష్ బాబు, రవి చైతన్య నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌‌ను హీరోయిన్ పాయల్ రాజ్‌‌పుత్, అనసూయ కలిసి రిలీజ్ చేసి టీమ్‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.

‘ధీరే ధీరే.. చేరా నీ దరే.. మతి చెదిరి మరిచా నిద్దరే.. మనసులు ముడిపడి ఇరువురి జత కుదిరే’ అంటూ సాగిన మెలోడీ సాంగ్ ఆకట్టుకుంది.   అనన్య క్యూట్ లుక్స్‌‌తో ఇంప్రెస్ చేస్తోంది.  ఆర్.ఆర్ ధృవన్ కంపోజ్ చేసిన పాటకు అలరాజు లిరిక్స్ రాయగా, అనురాగ్ కులకర్ణి పాడిన తీరు ఆకట్టుకుంది. టీజర్‌‌‌‌తో పాటు ఈ పాటకు మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉందని, సాంగ్ రిలీజ్ చేసిన పాయల్‌‌, అనసూయకు నిర్మాతలు థ్యాంక్స్ చెప్పారు.